ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ వెస్ట్ బైపాస్ పాక్షికంగా ప్రారంభం: ప్రయాణికులకు ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 02:05 PM

 విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విజయవాడ వెస్ట్ బైపాస్ (పశ్చిమ బైపాస్) పనులను పాక్షికంగా ప్రారంభించనున్నారు. కాజా నుండి గొల్లపూడి మధ్య ఒక వైపు రోడ్డును పండుగ సమయంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో కేవలం కార్లు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా గొల్లపూడి, చిన అవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లిపోవచ్చు. 2026 మార్చి చివరి నాటికి బైపాస్ పనులు పూర్తవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa