విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విజయవాడ వెస్ట్ బైపాస్ (పశ్చిమ బైపాస్) పనులను పాక్షికంగా ప్రారంభించనున్నారు. కాజా నుండి గొల్లపూడి మధ్య ఒక వైపు రోడ్డును పండుగ సమయంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో కేవలం కార్లు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా గొల్లపూడి, చిన అవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లిపోవచ్చు. 2026 మార్చి చివరి నాటికి బైపాస్ పనులు పూర్తవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa