సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తు న్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఇదే చిత్రం ద్వారా కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 25న విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ను నటుడు రానా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. చిత్ర సమర్పకుడు, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ మాట్లాడుతూ ”దాదాపు మూడేళ్ళ క్రితం కథ విన్నను. తపన కలిగిన యువ ప్రతిభావంతులు ఓ టీమ్గా ఏర్పడి ఈ సినిమా రూపొందించారు. ప్రతి డిపార్ట్మెంట్ తామే సొంతంగా సమకూర్చుకుంటా మన్నారు. ఈ విధంగా కూడా సినిమా తీయవచ్చా అనిపించింది. పెద్ద హిట్ అంటెంట్ ఉన్న సినిమాను చిన్న బడ్జెట్లో తీయడం ఆసక్తి కలిగించింది. శ్రీసింహా, కాలభైరవ, రితేష్రానా, థామస్, తేజ ఇలా అందరూ కొత్తవాళ్ళు కలిసి అద్భుతాన్ని సృష్టించారని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. హిట్ సినిమాతో ఈ ఏడాది ముగించబోతున్నామనే నమ్మకం ఉంది” అని తెలిపారు. నటుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ ”నటుడిగా తొలి సినిమా. నాతో పాటుగా అనేక మంది కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. శ్రీసింహా అనుభవజ్ఞుడిలా నటించారని ” అన్నారు.సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ ”తొలి సినిమా ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ సినిమా నాకు డబుల్ స్పెషల్. నేను సంగీత దర్శకునిగా, నా తమ్ముడు హీరోగా అరంగేట్రం చేస్తున్నాం. పూర్తిస్థాయి థ్రిలర్ సినిమా ఇది. నవ్విస్తూనే ఉత్కంఠ తను కలిగిస్తుంది” అని చెప్పారు. దర్శకుడు రితేష్రానా మాట్లా డుతూ ”పాటలు లేకుండా కేవలం పాత్రలు వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రమే కనిపిస్తాయి. యాదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తీయడం జరిగింది” అని చెప్పారు. ”కొత్తవారిని నమ్మి తీసిన సినిమా ఇదని” హీరో శ్రీసింహా చెప్పారు. నరేష్ అగస్త్య, అతుల్యచందర్, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, సంగీతం; కాలభైరవ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa