ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అక్కినేని అమల

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2019, 05:45 PM

అక్కినేని  అమల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని అన్నారు. ఇవాళ అమల గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ నివాసంలో మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ ఐఏఎస్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన ఆమె తమ నివాసంలోని ఆవరణలో 5 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవడం సంతోషం. ఇలాంటి మంచి ఆలోచనలు అరుదుగా వస్తాయనీ, వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన అనంతరం ఆమె మరో నలుగురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. వారిలో ఉపాసన కొణిదెల(రామ్ చరణ్ భార్య), వసంత వాడి(జంతు సంరక్షకురాలు), హీరా రూపానీ, బీసీహెచ్ టీమ్ ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa