‘ఎవడ్రా వాడు.. ఆ కళ్లలో పవరేంటి.. ఎక్కడి నుంచి వచ్చాడు..’ అంటూ ఓ వ్యక్తి బ్యాక్డ్రాప్లో డైలాగ్ చెబుతుండగా.. డైనమిక్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి నట‘సింహం’ బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఆదివారం (డిసెంబర్ 24) విజయవాడలో ఈ చిత్ర ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘జై సింహా’ ట్రైలర్ను విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ తనదైన శైలిలో చెబుతున్న మాస్ డైలాగ్లు, యాక్షన్ ఆకట్టుకుంటున్నాయి.
‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలిసుండాలి’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. ‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు’, ‘నేనంటే రెండు రాష్ట్రాలకూ ప్రాణం’ అంటూ చెప్పిన డైలాగ్లు కూడా అద్భుతం. నయనతారతో నందమూరి ప్రేమ సన్నివేశాలను కూడా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.
‘నీకు వయసు అవదు కదా! జీవితాంతం డ్యుయెట్లు పాడుకుంటూ ఉండవచ్చు.. కానీ, నాకు వయసు అయిపోతోంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్లతో ఆడుకోవాలని ఉంది’ అంటూ నయనతార చెప్పే డైలాగ్ కూడా అలరిస్తోంది. నయన్తో పాటు సినిమాలో హరిప్రియ, నటాషాదోషి కథానాయికలుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa