అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంతవరకు టైటిల్ ను పెట్టలేదు చిత్రబృందం. ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటల 15 నిముషాలకు టైటిల్ రివీల్ చేయనున్నామని సినిమా యూనిట్ నిన్న ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. ఈ సినిమా టైటిల్ తెలుగులోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa