కార్తికేయ హీరోగా నేడు ఓ కొత్త మూవీ ప్రారంభించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 పతాకంలో ఈ చిత్రం రూపొందుతుంది. ‘చావు కబురు చల్లగా’ అనే ఓ డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ హీరో కార్తికేయ బస్తీ బాలరాజు గా లుంగీలో ఇరగదీస్తున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా మూవీ ప్రారంభమైంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ చిత్రంలోని మిగతా నటులు మరియు పూర్తి సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. ఇక గత ఏడాది కార్తికేయ మూడు సినిమాలు విడుదల చేశారు. వాటిలో గుణ 369 అతనికి ఓ మోస్తరు విజయాన్ని అందించింది. ఆర్ ఎక్స్ 100 తరువాత ఆ స్థాయి విజయాన్ని కార్తికేయ అందుకోలేదు. మరి చావు కబురు చల్లగా సినిమాతో అయినా ఆయన మంచి హిట్ అందుకుంటారేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa