ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ నటి గాయత్రీ సాయికి వేధింపులు..

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2020, 02:31 PM

మణిరత్నం తీసిన ‘అంజలి’ సినిమాలో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన గాయత్రీ సాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. తమిళనాడు కు చెందిన గాయత్రి సాయికి వాట్సప్‌ గ్రూప్‌లో విపరీంతంగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రూపంలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ అడల్ట్‌ వాట్సప్‌ గ్రూప్‌లో ఆమె ఫోన్‌ నంబర్‌ను ఎవరో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో వాట్సప్ గ్రూప్‌లో ఆమె ఫోన్ నంబర్ షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ కంపెనీపై కూడా దర్యాప్తు చేపడుతున్నారు.
నిందితుడు ఇటీవల చెన్నైలోని ఆ నటి ఇంటికి పిజ్జా డెలివరీ చేయడంతో ఆమె ఫోన్‌ నంబర్ అతడికి తెలిసింది. అతడు వాట్సప్‌లో ఆమె ఫోన్‌ నంబర్‌ పెట్టడంతో ఎదురైన వేధింపులకు తట్టుకోలేకపోతున్నానని గాయత్రి రెండు రోజుల క్రితం  ట్వీట్ కూడా చేసి, ఆ యువకుడి ఫొటోను పోస్ట్ చేసింది. పోలీసులు అతడిని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందుకు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతూ మరో పోస్ట్ చేసింది. ఫోన్‌ నంబర్లు బయటకు వెళ్లకుండా చూసుకోవాలని పిజ్జా డెలివరి సంస్థ డోమినోస్‌తో పాటు ఇతర కంపెనీలకు ఆమె సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa