ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ 2 ఘటన పై కమల్ ను విచారించిన చెన్నై పోలీసులు...

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2020, 06:22 PM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది .నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే  ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ చిత్ర యూనిట్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే లైకా ప్రొడక్షన్‌కు సంబంధించిన వాళ్లతో పాటు చిత్ర దర్శకుడు శంకర్‌‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిచి ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారిస్తున్నారు. తాజాగా చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ హీరోగా నటిస్తున్న కమల్ హాసన్‌ను పిలిచి ఈ ఘటనపై ఆయన్ని ప్రశ్నించారు. కమల్ హాసన్.. మాత్రం పోలీసులు తనను ఘటనకు సంబంధించిన విషయాలను అడిగినట్టు చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాద ఘటనలో కృష్ణ (34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60), శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (28) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa