క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్కు స్టార్ డమ్ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్లో సుకుమార్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్గా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆయనతో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.బన్నీ-సుకుమార్ కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలోనే వీరికాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటించనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ తరహా పాత్రలో కనిపిస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa