ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పాత్రలు అందుకే చేయలేదు: మురళీమోహన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2020, 04:11 PM

1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది. ఇతడు సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు. కథానాయకుడిగా .. నిర్మాతగా మురళీమోహన్ కి మంచి పేరు వుంది. నిన్నటితరం కథానాయకుడిగా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించారు. కేరక్టర్ ఆర్టిస్ట్ గాను విభిన్నమైన పాత్రలలో మెప్పిస్తూ వస్తున్నారు.తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను సాఫ్ట్ కేరక్టర్స్ చేస్తూ వచ్చాను. అందువలన విలన్ తరహా పాత్రలు చేయాలనే ఆసక్తి ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే శారదగారు కథానాయికగా చేసిన ఓ సినిమాలో నేను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేశాను. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత కలిసొస్తుందని ఆలోచించే పాత్ర అది. ఆ సినిమా పరాజయం పాలైంది. మురళీమోహన్ ని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చూడలేకపోయాము అనే స్పందన ఆడియన్స్ నుంచి వచ్చింది. దాంతో ఇకపై నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయకూడదని ఆ రోజునే నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa