ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భాషతో సంబంధం లేకుండా ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. ఆయన పాట పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. బాలు స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. తాజాగా ఈయన కరోనా మహామ్మారిపై వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ సందర్భంగా సినీ నటులు తమ వంతు ఆర్ధిక సాయం కూడా ప్రకటించారు. ఈ కోవలోనే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినున్నట్టు తన ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి ప్రపంచం ఇంతకు ముందెన్నడు చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలుగారు.. పారిశుద్ధ్య, పోలీస్, డాక్టర్లకు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అందుకోసం శ్రోతలకు, నెటిజన్లను ఛాన్స్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను అడగవచ్చు. అది సినిమా గీతమైనా.. భక్తి గీతమైనా ఏదైనా కావొచ్చన్నారు. అందులో ఎవరు ముందుగా అడుగుతారో వారికే ఫస్ట్ ఛాన్స్ దక్కుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa