ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా పై పోరాటంలో రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన మోహన్‌లాల్..

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2020, 02:32 PM

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం కరోనా అనే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ మహామ్మారిని ఎదుర్కొవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా లాక్‌డౌన్ ప్రకటించి కరోనా వైర‌స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలా మంది నిరుపేదలకు పనిలేకుండా పోయింది. వారిని ఆదుకోవడానికి సినీ, క్రీడా, వాణిజ్య ప్రముఖలు ముందుకు వస్తున్నారు. ఎవరికీ వారు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ మహామ్మారిని ఎదుర్కోవడంతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన వంతుగా రూ. 50 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు.ఇందులో ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు తన వంతుగా సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళనాడు, బాలీవుడ సినీనటులు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మోహన్ బాబు కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించి భారతీయ సినీ నటులు కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్‌లో నటించిన సంగతి తెలిసిందే కదా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa