ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులు నాగార్జున, అల్లు అరవింద్, రాజమౌళితో మంత్రి తలసాని

cinema |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 01:03 PM

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా అనే మహామ్మారితో పోరాడుతున్నాయి. ఈ వైరస్ కట్డడిలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం  లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నాలుగు పర్యాయాలు కేంద్రం లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో అన్నిరకాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ  తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన చిత్ర పరిశ్రమను తిరిగి ఎలా గాడిలో పెట్టాలన్న అంశంపై కీలక చర్చలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. వీరిద్దరితో పాటు ఇండస్ట్రీ పెద్దలంతా సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చిస్తున్నారు.నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ చర్చల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాలపై కొంత స్పష్టత వస్తుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa