ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం నిలకడగానే ఉంది..

cinema |  Suryaa Desk  | Published : Sun, May 24, 2020, 04:19 PM

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మధురమైన పాటలు,డైలాగ్స్ రాసి షభాష్ అనిపించుకున్న ప్రముఖ గేయ రచయిత'సుద్దాల అశోక్ తేజ.  సుద్దాల అశోక్ తేజ అంటే తెలియని వారు ఉండరు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల్లో జడ్జీగా వ్యవహరిస్తూ వస్తున్నారు.ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. అశోక్ తేజకు ఆయన చిన్న కొడుకు అర్జున్ తేజ కాలేయం దానం చేయగా... గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు శనివారం ఉదయం 9.30 గంటలకు శస్త్ర చికిత్స ప్రారంభిచంారు. ఉదయం ప్రారంభైన  కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స సాయంత్రం ఆరు వరకు కొనసాగింది. ఆపరేషన్ తర్వాత తండ్రి కొడుకులు ఇరువురు ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అశోక్ తేజ్ విషయానికొస్తే..  తెలుగులో కే.రంగారావు దర్శకత్వంలో తనికెళ్ల భరణి మాటలు రాసిన ‘నమస్తే అన్న’ సినిమాతో గేయ రచయతగా సినీ ప్రస్థానం మొదలుపెట్టారు  సుద్దాల అశోక్ తేజ్. ఆ తర్వాత ఎన్‌కౌంటర్, ఒసేయ్ రాములమ్మ,శ్రీరాములయ్య చిత్రాలు ఆయనకు గేయ రచయతగా మంచి పేరు తీసుకొచ్చాయి.ఇక చిరంజీవి హీరోగా నటించిన ‘ ఠాగూర్’ సినిమాలోని నేను సైతం పాటకు జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. తెలుగులో మహాకవి శ్రీశ్రీ,  తర్వాత వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న మూడో గేయ రచయత సుద్దాల అశోక్ తేజ. కెరీర్ మొదట్లో  ఎక్కువగా విప్లవ సినిమాలకు పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ.. 6 టీన్స్‌లోని దేవుడు వరం అందిస్తే... పాటతో రొమాంటిక్ గేయాలను కూడా రాయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన నటుడు ఉత్తేజ్‌కి మేనమామ.  ఈయన వయసు 66 సంవత్సరాలు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో సుద్దాల  పాటల ప్రస్థానం ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa