ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ చాలా మంచి వ్యక్తి : బండ్ల గణేష్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2017, 01:40 PM

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణపై వరసగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సిట్ వరుసగా సినీ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ కీలకంగా మారారు. తెలుగులో స్టార్ హీరోలతో అతి తక్కువ సమయంలో సినిమాలు తీస్తూ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ కేసు ఆయనను తీవ్ర వేదనకు గురి చేసినట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలు తననెంతో బాధించాయని పూరీ అన్నారు.


డ్రగ్స్ కేసు పూరీ జగన్నాధ్‌ చుట్టూ ఈ కేసు తిరుగుతుండడంపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. పూరీ జగన్నాథ్‌తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు. డ్రగ్స్ కేసులో వస్తున్న ఆరోపణల గురించి తనకు తెలియదని, కానీ ఇలాంటి ఆరోపణల తర్వాత తిరిగి మళ్లీ సినిమాలు చేసేంత ఏకాగ్రత ఉండదని బండ్ల గణేష్ చెప్పాడు. అయితే పూరీ ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతాడని, ఓ మంచి బ్లాక్‌బస్టర్‌ను అందిస్తాడని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa