ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయమే గెలుస్తుంది: అంకిత లోఖాండే

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 30, 2020, 05:04 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ విషయంలో న్యాయమే గెలుస్తుందని బాలీవుడ్‌ నటి, సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకిత లోఖాండే అన్నారు. సుశాంత్‌ జూన్‌ 14న ముంబయిలోని ఆయన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడి మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అయితే, సుశాంత్‌ మరణం అనంతరం అతని మాజీ ప్రియురాలు అంకిత లోఖాండే చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ సుశాంత్‌ మరణంపై ఆయన తండ్రి కృష్ణ కిషోర్‌ సింగ్ పట్నాలోని రాజీవ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నటి రియా చక్రవర్తిపై కేసు పెట్టారు. ఈ క్రమంలో అంకిత తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ''న్యాయమే గెలుస్తుంది'' అంటూ పోస్టు చేశారు. దీనిపై సుశాంత్‌ సోదరి శ్వేత స్పందించారు. ''దేవుడు ఎప్పుడూ న్యాయంవైపే ఉంటాడు'' అని అన్నారు. శ్వేత తన ఇన్‌స్టాలో మరో పోస్టు కూడా చేశారు. ''ఐక్యంగా నిలబడదాం, న్యాయం కోసం కలిసి నిలబడదాం'' అని అభిమానులకు పిలుపునిచ్చారు. 'ఇండియా ఫర్‌ సుశాంత్' అనే వ్యాఖ్యను ఆమె జతచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa