ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ హైకోర్టుకు సన్నీలియోన్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 10, 2021, 09:28 AM

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. మోసం ఆరోపణలపై ఆ రాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నించడంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం దరఖాస్తు చేసింది. కేరళ పెరంబవూర్‌కు చెందిన ఆర్‌.షియాన్ చెందిన వ్యక్తి సన్నీ తనను మోసం చేసింద‌ని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి రూ.29లక్షలు తీసుకొని.. మోహం చాటేసిందని ఆరోపించాడు. ఇటీవ‌ల తిరువ‌నంత‌పురంలో టీవీ షో కోస‌మ‌ని స‌న్నీ లియోన్ హాజ‌రు కాగా, ఆమెను ప్రశ్నించి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సైతం బాలీవుడ్‌ బ్యూటీ ఖండించింది.


ఆర్గనైజర్‌ అన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పింది. షెడ్యూల్ స‌రిగా ఫిక్స్ చేయ‌కుండా ప‌లుమార్లు మార్చాడు. తనకు రావాల్సిన డబ్బును కూడా సకాలంలో చెల్లించలేదని ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేం రాత్రిబ‌వ‌ళ్లు షూటింగ్ చేస్తున్నాం. జీవితాలు రిస్క్ చేస్తూ ఇండ‌స్ట్రీకు మళ్లీ పాత రోజులు వ‌చ్చేలా చేస్తున్నాం. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఈవెంట్ మేనేజ‌ర్ ఇలాంటి దారుణ‌మైన మాట‌లు న‌న్ను ఎంత‌గానో బాధించాయి. దీనిపై నేను అధికారుల‌కు స్టేట్‌మెంట్ ఇచ్చాను. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది అని సన్నీ పేర్కొంది.  ప్రస్తుతం ‘స్ల్పిట్స్‌విల్లా’ కొత్త సీజన్ షూటింగ్‌లో భాగంగా తిరువనంతపురంలోనే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa