బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్ లు సినిమాల్లోనూ ఫుల్ బిజీ అవుతున్నారు. ముఖ్యంగా హాట్ జబర్దస్త్ భామలు అనసూయ, రష్మీ లు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమాలో నటిస్తుంది. ఇక రష్మి ఇప్పటికే గుంటూరు టాకీస్ సీనిమాలో హీరోయిన్ గా గ్లామరస్ పాత్రలో నటించింది. అయితే చాలా కాలం గ్యాప్ తరవాత మరో అదిరిపోయే ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. నాగార్జుజ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని రష్మి దక్కించుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. దాంతో సినిమాలో రష్మి ఎటాంటి పాత్రలో నటిస్తుందన్న ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉండగా రష్మి హీరోయిన్ గా నటించిన గుంటూరు టాకీస్ సినిమాను కూడా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఇక ఇప్పుడు తన సినిమాలోనే ప్రవీణ్ రష్మీకి అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా నాగార్జున బ్యానర్ లో వచ్చిన యువ అనే సీరియల్ ద్వారా రష్మీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa