సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు రిజబావా కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసారు. ఆయన గత కొన్ని రోజులుగా కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన సోమవారం కన్నుమూసారు. 90వ దశకంలో మలయాళ సినీ పరిశ్రమలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రిజబావా పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. రిజబావా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. రిజబావా 1990 లో షాజీ కైలాస్ దర్శకత్వంలో వచ్చిన ‘డాక్టర్ పశుపతి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా ఆయన సత్తా చాటారు. ముఖ్యంగా ‘ఇన్ హరిహర్ నగర్’లో చేసిన పాత్ర ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. దాదాపు 150కి పైగా మలయాళ సినిమాల్లో నటించిన ఆయన పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు. రిజబావా చివరగా మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘వన్’ సినిమాలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa