పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రత్యేకించి నార్త్ ఇండియాలో ప్రభాస్ హోరు బాహుబలి తర్వాత వేరే లెవెల్ లో ఉంది. ప్రభాస్ సాహో అనుకున్నంత రాలేకపోయిన ఇప్పుడు వస్తున్న రాధేశ్యామ్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అందరూ అనుకోవడం గమనార్హం.
ఈ మూవీ రిలీజ్ కి డేట్ కూడా ఫిక్స్ అయింది. జనవరి 14న వరల్డ్ వైజ్ గా మూవీ తెర ముందుకు వస్తోంది. ఈ మూవీలో ప్రేమ కోసం ప్రభాస్ హీరోయిన్ పూజా హెగ్డే చేసే పోరాటమే సెల్యూలాయిడ్ మీద సరికొత్త ఆవిష్కరణ అంటున్నారు డైరెక్టర్ రాధాక్రిష్ణ. మ్యూజిక్ బాగుంది టేకింగ్ కూడా అదరహో అన్న రేంజిలో ఉండవచ్చునని టీజర్స్ చెబుతున్నాయి. అంతటా పాజిటివ్ బజ్ ఉన్న టైమ్ ఒక న్యూస్ మాత్రం పుకారు లా షికారు చేస్తోంది. అదేంటి అంటే రాధేశ్యామ్ ని ఓటీటీలో రిలీజ్ చేస్తారు అని. నిజంగా ఇది నమ్మతగిన న్యూసేనా అంటే తెలియదు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అసలు రాధేశ్యామ్ కి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే దేశంలో ప్రపంచమంలో ప్రస్తుతం మారిన పరిస్థితుల వల్లనే ఇలాంటి ప్రచారం వస్తోంది అంటున్నారు. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ తో జనమంతా బెంబేలెత్తుతున్నారు. మరో వైపు దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దాంతో నార్త్ ఇండియాలో ఆంక్షలు మొదలైపోయాయి.రాత్రి పూట కర్ఫ్యూలు కూడా పెడుతున్నారు. పరిస్థితి ఇంకా సీరియస్ అనుకుంటే త్వరలోనే పగటి పూట కూడా కొత్త నిబంధలను తీసుకువచ్చే చాన్స్ ఉంది. దాంతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కి ఈ టెన్షన్ పట్టుకుందిట. నార్త్ ఇండియాలో మూవీస్ కి జనాలు వచ్చేది అంతా నైట్ షోస్ కే. ఉదయం షోలు అక్కడ ఎపుడూ పెద్దగా ఫుల్ అవవని ట్రేడ్ అనలిస్టులు చెబుతారు.
మా హీరో రికార్డులను తిరగరాస్తాడు. రాధేశ్యామ్ తో బాలీవుడ్ షేక్ కావడం ఖాయమని వారు అంటున్నారు. ఇవన్నీ పుకార్లుగానే చూడాలని కూడా చెబుతున్నారు. చివరికి ఏమి అవుతుందో చూడాలి మరి ..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa