నయనతార గురించి వినని తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడు. ఇంచుమించు అందరితో కలిసి నటించిన అనుభవం ఉన్న హీరోయిన్ నయనతార. ఐతే తన పర్సనల్ జీవితంలో కూడా అందరితో మంచిగా నడుచుకోవడం చేస్తుంది అని సినీ వర్గాల సమాచారం. తన జీవితంలో మొదట తమిళ దర్శకుడు T. రాజేందర్ తనయుడు శింబు ని ప్రేమించడం , తరవాత విడిపోవడం మళ్ళి ఇద్దరు బిడ్డలా తండ్రి ఐన ప్రభుదేవాని ప్రేమించడం , మళ్ళి విడిపోవడం జరిగింది. న జీవితంలో నేను చేయకూడనివి చేశాను అనే భవనంలోకి వెళ్తున్న సమయంలో తమిళ దర్శకుడు పరిచయం తనకి ఒక వరంలా దొరికింది అనే చెప్పాలి. నయనతార, విఘ్నేష్ శివన్ సుదీర్ఘ ప్రేమాయణం ప్రస్తుతం పెళ్లి దశలోకి మారుతుండటం కూడా తెలిసిందే.
ఐతే, వీరిద్దరూ కలిసి "రౌడీ పిక్చర్స్" అనే బ్యానర్ స్థాపించి జంటగా సినిమాలు నిర్మిస్తున్నారు. దర్శకుడిగా విఘ్నేష్ శివన్ ఆదాయం పెంచుకునే పనిలో ఉన్నారు. అలాగే నటిగా నయన్ ఆదాయం ప్రియుడి ఆదాయాన్ని మించి ఉంది. ఇటీవలే సొంత బ్యానర్లోనే `రాకీ` అనే చిత్రాన్ని నిర్మించారు. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహంచారు. ఈ మధ్యనే సినిమా రిలీజ్ అయింది. దీంతో `రాకీ` చిత్రాన్ని వీక్షించడం కోసం ఈ జంట బుధవారం చెన్నైలోని ఎస్కేప్ మాల్ కి వెళ్లారు. ఇద్దరు ఒకే రంగు బట్టలు వేసుకొని ఉండటం కూడా విశేషమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa