ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా పగబటిందా...రాజేంద్రప్రసాద్ కు సోకిన కరోనా

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 05:37 PM

కరోనా ముప్పేటి దాడితో సీని పరిశ్రమకు చెంబదిన ప్రముఖులు ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా   సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా మహమ్మారి బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాజేంద్రప్రసాద్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. టాలీవుడ్ లో ఇటీవల మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులు కరోనా బారినపడడం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa