దర్శకుడికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని భీమ్లా నాయక్ చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర వెల్లడించారు. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. పవన్ అగ్రహీరో అయినప్పటికీ దర్శకుడికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి అని కొనియాడారు. భీమ్లా నాయక్ సమయంలో ఈ సినిమాకు సంబంధించి తాను ఇంకేమైనా అదనంగా చేయాలా? అని పవన్ కల్యాణ్ అడిగారని వెల్లడించారు. అంతేకాదు, మరో టేక్ చేయమన్నా చేసేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారని, తాను చెప్పేది శ్రద్ధగా వినేవారని సాగర్ కె చంద్ర వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa