ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టైగర్ నాగేశ్వరరావు' లో రవితేజ సరసన గాయత్రి భరద్వాజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 05:18 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ప్రాజెక్ట్స్ లో వంశీ దర్శకత్వం వహించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఒక్కటి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని  తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa