టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ప్రాజెక్ట్స్ లో వంశీ దర్శకత్వం వహించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఒక్కటి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa