టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ 'పేపర్ బాయ్', 'మంచి రోజులు వచ్చాయి' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి 'శ్రీదేవి శోబన్ బాబు' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈరోజు సోషల్ మీడియాలో మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ను ఏప్రిల్ 6, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మూవీ మేకర్స్ ఒక చిన్న ఫన్నీ వీడియోను కూడా విడుదల చేసారు. రొమాంటిక్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన కోలీవుడ్ బ్యూటీ గౌరీ జి కిషన్ జంటగా నటిస్తుంది. గోల్డ్బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమా నిర్మించబడింది. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa