మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా, జులై 1, 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ప్రకటించారు. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో గోపీచంద్ సరసన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ తెలుగు OTT ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ప్లాట్ఫారమ్లో ప్రదర్శించబడుతుందని ఆహా టీమ్ ప్రకటించింది. ఈ సినిమాలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa