ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 ఆసక్తికర సినిమాలను లైన్ లో పెట్టిన అడివి శేష్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 11:37 AM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ 'మేజర్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 27, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'మేజర్' స్టోరీ 26/11 ముంబై టెర్రర్ ఎటాక్స్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ కి రిలీటెడ్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లను కూడా మేకర్స్ ప్రారంభించాడు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, అడివి శేష్ ప్రస్తుతం యాక్షన్‌ థ్రిల్లర్‌ట్రాక్ లో రానున్న 'హిట్‌ 2' సినిమాకి సైన్ చేసాడు. అంతేకాకుండా, మరో నాలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లైన్లో ఉన్నాయి. 'ది కాశ్మీర్ ఫైల్స్' నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో తనకు స్ట్రెయిట్ హిందీ సినిమా ఉందని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పాడు. 'మేజర్‌' సినిమాని GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ,మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa