ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతోందా.? అంటే, ఔననే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది.ఓ భారీ సినిమా కోసం రికార్డు మొత్తాన్ని అడ్వాన్సుగా త్రివిక్రమ్ శ్రీనివాస్కి గతంలో మైత్రీ సంస్థ ఇచ్చింది. అయితే, ఇచ్చిన మాటకు కట్టుబడి త్రివిక్రమ్ ఆ బ్యానర్లో సినిమా చేయలేదు. దాంతో, త్రివిక్రమ్ నుంచి అడ్వాన్స్ని తిరిగి రాబట్టుకుంది మైత్రీ సంస్థ వడ్డీతో సహా.
అప్పటినుంచి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో ఓ ఆట ఆడుకుంటున్నాడట. మైత్రీ – పవన్ కాంబినేషన్లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా తెరకెక్కాల్సి వుంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల 'భవదీయుడు భగత్ సింగ్' వెనక్కి వెళుతోంది.అసలు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ని లూప్ లైన్లోకి లాగడమేనని అంటున్నారు. 'భీమ్లానాయక్' సినిమా మధ్యలోకి వచ్చింది త్రివిక్రమ్ వల్లనే. 'వినోదయ సితం' రీమేక్ కూడా అలాగే లైన్లోకి రాబోతోంది. 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాని వెనక్కి నెట్టడానికి, పవన్ కళ్యాణ్తో వరుస రీమేకులు చేయిస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ఆగిపోయిందంటూ త్రివిక్రమ్ వ్యాఖ్యానించాడంటూ ఓ గాసిప్ బయటకు వచ్చింది. ఆ వెంటనే మైత్రీ నిర్మాతలు, దర్శకుడు హరీష్ శంకర్ నేరుగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళారు. సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకుంటుందంటూ ప్రకటన కూడా చేశారు.అయితే, పవన్ ప్రస్తుతం 'హరిహర వీర మల్లు' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. 'వినోదయ సితం' గనుక సెట్స్ మీదకు వెళితే, హరీష్ శంకర్ మరికొంతకాలం పవన్ కోసం ఎదురుచూడక తప్పదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa