పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున "హరి హర వీర మల్లు" సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభమైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 'హరి హర వీర మల్లు' టీమ్ త్వరలో భారీ యాక్షన్ బ్లాక్ని షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ బ్లాక్లో మొత్తం 1000 మంది ఆర్టిస్టులు పాల్గొననున్నారు అని టాక్. ఈ సినిమాకి ఈ ఫైట్ సీక్వెన్స్ ప్రధాన హైలైట్ గా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa