ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్-బోయపాటి శ్రీను సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 10:23 AM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 2019లో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నాడు అండ్ తిరుమల కిషోర్ డైరెక్షన్ లో వచ్చిన 'రెడ్‌' తో హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు, పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో కథానాయిక పాత్రల కారణంగా సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది అని సమాచారం. కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పటికే కథానాయికగా సెలెక్ట్ చేసారు. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేయడంతో సెకండ్ హీరోయిన్‌ని సెలెక్ట్ చేయడంలో ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa