ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 01:40 PM

టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. 'ఆచార్య' నిర్మాతలు ఏప్రిల్ 23వ తేదీన విజయవాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడ సిద్ధార్థ కళాశాల లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa