ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కోసం 7 కోట్ల భారీ సెట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 05:52 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, 'టైగర్ నాగేశ్వరరావు' నిర్మాతలు భారీ స్పెషల్ సెట్ ని నిర్మించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుతార్‌పురం విలేజ్‌ని ప్రతిబింబించే ఈ భారీ సెట్ కోసం నిర్మాత అభిషేక్ అగర్వాల్ 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. మెజారిటీ షూటింగ్ ఈ సెట్‌లోనే జరుగనుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa