వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, 'టైగర్ నాగేశ్వరరావు' నిర్మాతలు భారీ స్పెషల్ సెట్ ని నిర్మించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుతార్పురం విలేజ్ని ప్రతిబింబించే ఈ భారీ సెట్ కోసం నిర్మాత అభిషేక్ అగర్వాల్ 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. మెజారిటీ షూటింగ్ ఈ సెట్లోనే జరుగనుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa