టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. 'ఆచార్య' నిర్మాతలు ఏప్రిల్ 23వ తేదీన విజయవాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆయనను ఈ ఈవెంట్ కి ఆహ్వానించే ఆలోచనను మేకర్స్ విరమించుకున్నట్లు సమాచారం. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ వార్తతో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa