'ఆర్ ఆర్ ఆర్' లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక మూవీ ని చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 15 వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ RC #15 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతుంది. అయితే ... ఇటీవలనే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా పంజాబ్ లో మరో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో అక్కడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులను కలిసిన చరణ్ వారితో కొంత సమయాన్ని గడిపి, వారు చేస్తున్న దేశసేవకు కృతజ్ఞతలను తెలియజేసారు. అంతేగాక, జవాన్ల కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా భోజనాన్ని తయారుచేయించి తెప్పించారట. వారందరితో కలిసి చరణ్ లంచ్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పోతే... RC #15 లో చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తుంది. వినయ విధేయ రామ తర్వాత హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి ఈ సినిమాలో చరణ్ తో జోడి కట్టనుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథని అందించటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa