పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈరోజు ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ సినిమా మే 12కి రిలీజ్ కానుంది అని అంతేకాకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాని 'అంటే సుందరానికి' మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa