అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన 'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి ఆమె స్కిన్ షోకు దూరంగా ఉంది. ఎంపిక చేసుకున్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోయిన్గానే కాకుండా స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించిన ఘనత ఆమె సొంతం. గతేడాది అమెజాన్ ప్రైమ్లో విడుదలైన పెంగ్విన్ చిత్రలో ఓ పిల్లాడి తల్లిగా కూడా నటించింది. ఈ తరుణంలో తన సినీ ఇండస్ట్రీలో తన పరిధులు, తన ఇష్టాలు గురించి మీడియాతో తన భావాలు పంచుకుంది.
గ్లామర్ పాత్రలు ఎప్పటికీ తన మొదటి ప్రాధాన్యం కానేకాదని కీర్తి సురేష్ చెప్పింది. కమర్షియల్ సినిమాలో హద్దు దాటి కనిపించడం తన వల్ల కాదని చెబుతోంది. నటిగా గుర్తింపుతో పాటు అవి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న హీరోయిన్ పాత్రలే తనకు దక్కుతున్నట్లు ఆమె వెల్లడించింది. వాటి వల్లే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నట్లు వివరించింది. కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సిినిమాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇలా బ్యాలెన్స్ చేయడం వల్ల సినీ కెరీర్లో ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమాలు చేయాలనేది తన తపన అని చెప్పింది. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’, చిరంజీవితో ‘భోళా శంకర్’, నానికి జోడీగా ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa