ఇటీవలి కాలంలో కొన్ని పెద్ద సినిమాలకు కేవలం ఒక సినిమాటోగ్రాఫరే కాక, ఇద్దరు ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పని చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు పూర్తి కావటానికి అనుకున్నదానికన్నా కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇలాంటి పెద్ద సినిమాలకు పని చేసే ఛాయాగ్రాహకులు వారు కమిటైన మిగిలిన సినిమాల కాల్షీట్లతో క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. మరి అలాంటి సమయంలో వేరొక ఛాయాగ్రాహకుడిని తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే పరిస్థితి ఇప్పుడు చెర్రీ- శంకర్ ల సినిమాకు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 15 వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే ఈ మూవీ పంజాబ్ లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే ఈ షెడ్యూల్ ప్రారంభమవక ముందే, ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న తిరు అనుకోని కారణాల వల్ల ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. చరణ్-శంకర్ కు, తిరుకు మధ్య క్రియేటివ్ డిఫరన్సెస్ వల్ల అని కొంతమంది చెప్తుంటే, మరికొంతమందేమో తిరు వేరే సినిమాకు కమిట్ అవడం వల్లే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అంటున్నారు. అయితే చిత్రవర్గ సమాచారం ప్రకారం ఏం తెలుస్తుందటే, శంకర్ చాలా సీనియర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్. తాను అనుకున్న ఔట్ పుట్ రావటానికి టెక్నీషియన్స్ ని బాగా కష్టపెట్టిస్తారట. దీంతో కొంతమంది టెక్నిషియన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటిదే తిరు కు కూడా ఎదురయ్యింది. అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అని చెప్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు కొత్త సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు ను తీసుకొచ్చే పనిలో ఉన్నారట చరణ్. ఇక మిగిలిన సినిమా మొత్తానికి ఆయనే పని చేయనున్నారట. రోబో, రంగస్థలం సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు ఈ సినిమాకు కూడా తన కెమెరా పనితనాన్ని చూపిస్తే ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa