ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమయంలో అవమానం అనిపించింది: చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 10:40 AM

ఏప్రిల్ 29న చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. వేదికపై మాట్లాడుతూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1988లో నాగబాబు నిర్మాతగా, తాను హీరోగా నటించిన ‘రుద్రవీణ’ సినిమా విడుదలైందన్నారు. దానికి సంబంధించి నేషనల్ అవార్డు వచ్చిందన్నారు. అది తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లగా అక్కడ ఊహించని అనుభవం ఎదురైందన్నారు. అవార్డుల వేడుకకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సినిమాల పోస్టర్లను ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. అక్కడ దక్షిణాదికి సంబంధించి ఎమ్‌జీఆర్‌గారు, జయలలితగారు నటించి ఒక్క పోస్టర్‌ను మాత్రమే ప్రదర్శించారన్నారు. మిగిలినవన్నీ హిందీ హీరోల సినిమా పోస్టర్లే కనిపించాయన్నారు.


ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోల పోస్టర్ ఒక్కటి కూడా లేదన్నారు. ఆ సమయంలో భారతీయ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అని భావించే వారన్నారు. తనకు అది చాలా అవమానంగా అనిపించిందన్నారు. అయితే భాషాభేదం, వివిధ సినీ ఇండస్ట్రీల మధ్య అడ్డుగోడలను రాజమౌళి తొలగించారన్నారు. రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి అని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa