ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' టికెట్ల ధరల పెంపు పై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 12:11 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలను సినిమా విడుదలైన తొలి 10 రోజుల పాటు రూ.50 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు దాటిన సినిమాలకు తమ ప్రోత్సాహం ఉంటుందని గతంలో సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ వెసులుబాటు అందించింది. తాజాగా 'ఆచార్య' సినిమాకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.


కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల అవనుంది. ఈ సినిమాలో చిరు తనయుడు రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించింది. మణిశర్మ అందించిన బాణీలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు తెలంగాణ సర్కారు కూడా అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపునకు సోమవారం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa