ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదరగొడుతున్న కియారా అద్వానీ అందాలు.. రెడ్ డ్రస్ లో మెరుపులు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 02:55 PM

అందాల భామ కియారా అద్వానీ సౌత్ లో కూడా పాపులర్ అవుతోంది. ప్రస్తుతం కియారా అద్వానీ రాంచరణ్ సరసన RC15 మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ. నాజూకు అందాలతో కియారా అద్వానీ చేసే మాయ అంతా ఇంతా కాదు. 


ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. టాలీవుడ్ లో కియారా అద్వానీకి మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ కియారాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa