ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్ వర్క్ సమస్యవల్ల నేను ఆచార్యలో చేయలేకపోయా: అయ్యప్ప శర్మ

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 11:17 PM

చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సాయికుమార్ సోదరుడు అయ్యప్ప శర్మ ప్రస్తావించాడు.


"నేను ఓ కన్నడ సినిమా షూటింగు కోసం ఒక మారుమూల గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఎలాంటి నెట్ వర్క్ ఉండేది కాదు. ఆ సమయంలో 'ఆచార్య' సినిమా కోసం నన్ను కాంటాక్ట్ చేశారట. వాళ్లు పెట్టిన మెసేజ్ కూడా నాకు ఆ తరువాత ఎప్పటికో వచ్చింది. వాళ్లు అడిగిన డేట్లు ఉండి కూడా నెట్వర్క్ సమస్య కారణంగా నేను 'ఆచార్య' చేయలేకపోయాను. 


 చిరంజీవిగారితో కలిసి సినిమా చేయలేకపోయానే అనే బాధ నన్ను అలా వెంటాడుతూనే ఉంది. మా నాన్నగారి హయాం నుంచి చిరంజీవిగారి ఫ్యామిలీతో మంచి స్నేహ సంబంధం ఉంది. సాయికుమార్ నుంచి ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది. చిరంజీవిగారితో కలిసి నటించే ఛాన్స్ త్వరలోనే మళ్లీ వస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa