కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కెరీర్ పరంగా చిరుకిది 153వ చిత్రం. ఏప్రిల్ 29న అంటే రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల బన్నీ సినిమా వాయిదా పడింది. ఈ లోపు కొరటాల తన తదుపరి సినిమాను తారక్ తో ప్రకటించి జూన్ లో షూటింగ్ కు కూడా సిద్ధమై పోతున్నాడు.మొదటి నుండి కూడా బలమైన కథాకథనాలతో ప్రేక్షకులను రంజింపజేసి సూపర్ హిట్లు కొడుతున్న కొరటాల తన తదుపరి ప్రాజెక్టులలో భాగంగా భారీ లైనప్ ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆచార్య ప్రొమోషన్ ఇంటర్వ్యూలలో కొరటాల స్వయంగా తన తదుపరి సినిమాలను ప్రకటించటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తారక్ తో సినిమా అయిపోయిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒక ప్రత్యేకమైన కథను కూడా కొరటాల సిద్ధం చేశారట. ఆ తర్వాత తనకు తొలి అవకాశం ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడట. ఆ వెంటనే ఐకాన్ స్టార్ తో మరో సినిమా. తదుపరి సిద్ధ అదేనండి రామ్ చరణ్ తో మరో సినిమా.... ఇలా పెద్ద పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ మూవీలను ప్లాన్ చేసాడు కొరటాల. పాన్ ఇండియా అంటూ రాజమౌళి ఏళ్లకు ఏళ్ళు గడువు తీసుకుంటుంటే ఈ లోపు కొరటాల టాలీవుడ్ లో అయన స్థానాన్ని భర్తీ చేసేట్టు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa