పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రొడక్షన్ను పూర్తి చేసి రీరికార్డింగ్, ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మే 2, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించడానికి మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa