పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తాజాగా ఇప్పుడు గ్లామర్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రముఖ FM రేడియో స్టేషన్లతో ఇంటరాక్ట్ అయ్యింది. అలాగే మీడియాకి కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలు త్వరలో ఆన్లైన్లో ప్రసారానికి అందుబాటులోకి రానున్నాయి. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa