అనుకున్నట్టుగానే జరిగింది. రాజమౌళి సెంటిమెంటుకు తెరపడేలా కనబడట్లేదు. జక్కన్న సినిమాల్లో నటించే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ కంపల్సరీ. అలానే ఆ తర్వాత వాళ్ళు పరాజయాలను ఎదుర్కోవలసిందే. చిత్రసీమలో ఇదొక రూల్ గా మారింది. ఇప్పటివరకు ఎన్నోసార్లు నిరూపితమైన ఈ విషయం తాజాగా విడుదలైన ఆచార్య తో మరోసారి రుజువయ్యింది. 'ఆర్ ఆర్ ఆర్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ను, దేశవ్యాప్త క్రేజును సొంతం చేసుకున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రంగా కొరటాల డైరెక్షన్లో చేసిన ఆచార్యతో భారీ పరాజయాన్ని ఎదుర్కోనున్నారు. సక్సెస్ మెషిన్ కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. నిజానికిది చిరంజీవి సినిమా. అందులో చెర్రీ అతిధి పాత్రలో కనిపిస్తాడని విడుదల ముందు వరకు చిత్రబృందం డప్పేసుకుని చెప్పినా తెరమీద సినిమా చూసేసరికి సీన్ రివర్స్ అన్నమాట. చెర్రీ సినిమాలో చిరు అతిథి పాత్ర చేసినట్టుంటుంది. అందుకే రాజమౌళి సెంటిమెంటు వర్క్ ఔట్ అయ్యి సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుని ఉంటుందని మెగా అభిమానుల విశ్లేషణ. భారీ అంచనాల నడుమ ఈ రోజే విడుదలైన ఆచార్య మెగా అభిమానులకు సైతం నచ్చలేదంటే ఈ సినిమా ఎంత డిజాస్టరో అర్ధం చేసుకోండి. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవటం పోగా నెగిటివ్ రివ్యూ లను సొంతం చేసుకుంటుంది. చిరంజీవి నటించాల్సిన సినిమా కాదని, ఆయన కెరీర్ లోనే వరస్ట్ సినిమా అనీ, అస్సలు చిరు నటనే మైనస్ అని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. కొరటాల మార్క్ మూవీ కాదని, చిరు కోసం అనవసరంగా తన సోషియో కమర్షియల్ మూవీ ఫార్ములాను పక్కన పెట్టాడని సినిమా చూసిన ఎవ్వరికైనా తెలుస్తుంది. పోతే... ఆర్ ఆర్ ఆర్ లో లీడ్ రోల్ లో నటించిన మరో నటుడు జూనియర్ ఎన్టీయార్. ఆయన కూడా తన తదుపరి చిత్రాన్ని కొరటాల తోనే చేయనున్నారు. ఆ మూవీ ఫలితంపై తారక్ అభిమానులు ఇప్పటి నుండే బెంగ పెట్టుకున్నారు. విచిత్రమేంటంటే, రాజమౌళి సెంటిమెంటుకు కొరటాల బలైపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa