బాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన క్రేజీ డైరెక్టర్ రోహిత్ శెట్టి. దర్శకుడిగానే గాక నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్ గా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గోల్ మాల్ సిరీస్, సింగం, బోల్ బచ్చన్, చెన్నై ఎక్స్ప్రెస్, సూర్యవన్షి సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. తాజాగా రోహిత్ శెట్టి ఒక బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అధికారక ప్రకటన కూడా చేసాడు. ముంబై పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా ఆత్మకథగా విడుదలైన రాకేష్ మారియా : లెట్ మీ సే ఇట్ నౌ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రోహిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాకేష్ మారియా 1981 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 1993 లో ముంబైలో జరిగిన సీరియల్ బ్లాస్ట్ కేసులను ఛేదించడంలో రాకేష్ ఎంతో కృషి చేసాడు. ఆ తర్వాత 2003 లో ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా, జవేరీ బజార్ ట్విన్ బ్లాస్ట్ కేసులను ఛేదించారు. 2008లో ముంబై తాజ్ హోటల్ లో జరిగిన దాడుల (26/11) ఇన్వెస్టిగేషన్ లో, భయంకర టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ఇంటరాగేషన్ లో రాకేష్ ముఖ్య పాత్ర పోషించారు. ఇంతటి గొప్ప వ్యక్తి బయోపిక్ ను తెరకెక్కించే అవకాశం తనకొచ్చినందుకు రోహిత్ సంతోషిస్తున్నాడు. ఈ సూపర్ కాప్ జర్నీ ని తెరపై తీసుకురావటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa