క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్కి మేకర్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మే రెండో వారం నుండి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు ఉంటుంది అని సమాచారం. ఈ సినిమాలో నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa