ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైవిధ్య పాత్రలవల్లే ఆడియన్స్ నన్ను ఆదరించారు: కృతి శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 01:53 PM

 వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరిస్తున్నారు అని హీరోయిన్ కృతి శెట్టి పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై దూసుకుపోతున్న కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తుంది. తొలి సినిమా 'ఉప్పెన'తోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత చేసిన 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. కెరియర్ ఆరంభంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.


ప్రస్తుతం కృతి శెట్టి నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి. సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. నితిన్ జోడీగా చేసిన 'మాచర్ల నియోజకవర్గం' ..  రామ్ సరసన కథానాయికగా చేసిన 'ది వారియర్' ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. 


 తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. " ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు. తెరపై 'రాకుమారి'గా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa