టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 12, 2022న గ్రాండ్గా విడుదల కానుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల తాజాగా జరిగిన మీడియా ఇంటర్వ్యూలో, 'సర్కారు వారి పాట' సోలో లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సినిమాలో మహేష్ బాబుకి ఇష్టమైన పాటను వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో 'ఎవ్రీ పెన్నీ' పాటను చాలా ఇష్టపడ్డారాని అలాగే ఈ అందమైన పాటను వ్రాసినందుకు అతన్ని అభినందించారని అనంత శ్రీరామ్ చెప్పారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa