బాలీవుడ్ ప్రముఖ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏప్రిల్ 30నే బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ఆలస్యంగా ఈ విషయం వెల్లడైంది. దీనిపై బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా సోషల్ మీడియా ద్వారా విషయం వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు హజ్రా పేర్కొన్నారు. దీంతో తమ అభిమాన హీరో అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మిథున్ చక్రవర్తి ఆసుపత్రి బెడ్పై పడుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుతూ పోస్టులు పెడుతున్నారు.
అభిమానుల ఆందోళనపై మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తారని ప్రకటించారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో నొప్పిని ఆయన భరించలేకపోయారని, దీంతో ఏప్రిల్ 30న ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారని, ప్రస్తుతం డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి పొందుతున్నారని చెప్పారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక 1980-90 సమయంలో హిందీ, బెంగాలీ చిత్రాలలో మిథున్ చక్రవర్తి పలు హిట్ చిత్రాలలో నటించారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంలో చివరిగా కనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa